calender_icon.png 17 June, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి బల్దియా రోడ్లకు మహార్దశ..

17-06-2025 04:42:01 PM

రూ.5 కోట్లతో రోడ్లు, సెంట్రల్ లైటింగ్ కు శంకుస్థాపన..

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గం కేంద్రం బెల్లంపల్లి మున్సిపాలిటీ అర్హదారులకు మహర్దశ వరించింది. రూ. ఐదు కోట్ల నిధులతో రహదారులు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని రూ.2 కోట్లతో నిర్మించే గాంధీ విగ్రహం నుండి పోచమ్మ టెంపుల్ వరకు రెండు వరుసల బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తిలో రూ. కోటి నిధులతో సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఏఎంసీ చౌరస్తా వరకు రూ. 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు.

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ..

బెల్లంపల్లి పట్టణం 13వ వార్డులో నూతనంగా నిర్మించి తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకి ఎమ్మెల్యే గడ్డం వినోద్ భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరైన ఇండ్లకు పొజిషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని వెల్లడించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేసామనీ తెలిపారు. ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు పట్టాలు ఇచ్చి వారి కలలను సహకారం చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతో కృషి చేస్తుందనిన్నారు. ఇందులో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున 4 విడతలలో నేరుగా లబ్ధిదారుల ఖాతలలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా జరిగిందనన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులను గ్రామస్తులను వెంటబెట్టుకొని ఒక్కటికి రెండుసార్లు సర్వే చేసి ఎంపిక చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తాసిల్దార్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు, తాజా మాజీ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ నాయకులు చిలుముల శంకర్, ము మునిమంద రమేష్, ముచ్చర్ల మల్లయ్య తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార కార్యకర్తలు, లబ్ధిదారులు, అధికారులు  పాల్గొన్నారు.