l ఈ నెల 25 వరకు గడువు పొడిగించిన ఆర్టీసీ
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలంబ్రాలను ఆన్లైన్ బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ పొడిగించింది. ఈ నెల 25వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. రూ.151కే విశిష్టమైన రాములోరి కళ్యాణ తలంబ్రాలు పొందేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్ tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలను బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆఫ్లైన్ ద్వారా కూడా తలంబ్రాలను పొం దేందుకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 040 0033, 040 0000, 040 ను సంప్రదించాలని కోరారు.