25 August, 2026 | 8:51 AM

చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు

22-05-2026 09:00 PM

 కిరాణా, పాన్ షాప్ ప్రాంతాలలో నార్కోటిక్ జాగిలంతో తనిఖీ 

మత్తు పదార్థాల విక్రయాలు రవాణాపై కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ రమేష్

చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలంలోని పలు గ్రామాలలో కిరాణా, పాన్ షాప్,బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు పోలీసు అధికారులు నార్కోటిక్ డాగ్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన, భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని చందుర్తి ఎస్సై రమేష్ పేర్కొన్నారు.