25 August, 2026 | 2:07 PM

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి

22-05-2026 09:21 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దరూరి యోగానంద చార్యులు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామపంచాయతీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానంద చారులు శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వెంటనే చిత్రపటాలను ఏర్పాటు చేయాలని, వారం రోజుల్లో ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తామే ఏర్పాటు చేస్తామని అన్నారు.ఇట్టి విషయంలో అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.