19 May, 2026 | 7:51 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన యోధుడు భగత్ సింగ్..

23-03-2025 06:59 PM

ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీరుపారి వెంకటేశ్వర్లు..

మునుగోడు (విజయక్రాంతి): భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటి సామ్రాజవాదులను గడగడలాడించిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పురి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమి వేసేందుకు తన ప్రాణాలను బలిదానం చేసిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని కొనియాడారు. దేశంలో యువత సంక్షేమం ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఉప్పర బోయిన సతీష్, బండారు శంకర్, మండల కార్యదర్శి చాపల శ్రీను, దుబ్బ వెంకన్న, తిరందాస్ శ్రీనివాస్, పుల్కరం ఆంజనేయులు, గోస్కొండ మల్లేష్, చాపల విప్లవ కుమార్, బొలుగురి వంశీ, పగిళ్ల బాబు, జి రాము, ఏ నాగరాజు ఉన్నారు.