6 July, 2026 | 1:07 PM

Breaking News

సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •   పారిశుద్ధ్యం... పంచాయతీ కేంద్రాల్లో అధ్వానం   •  

ప్రభుత్వాన్ని హెచ్చరించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి

15-09-2024 12:00 PM

హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం అల్టిమేటం జారీ చేసింది. నిమజ్జనం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీగా వస్తోందని, నిమజ్జనం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి నిరసనగా జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్‌ బ్యానర్లు, బారికేడ్లను సమితి సభ్యులు తొలగించారు.

ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తున్నదని, కొత్త ఆంక్షలు విధించి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని అధికారులను కోరారు. 2022, 2023లో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ, చివరికి అనుకున్న ప్రకారం నిమజ్జనం జరిగిందని వారు సూచించారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈరోజు మధ్యాహ్నం వరకు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రేపు హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తామన్నారు. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించించారు.