18 March, 2026 | 11:17 PM

అరెకపూడి గాంధీ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు

15-09-2024 11:34 AM

హైదరాబాద్: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 200 మంది సిబ్బందితో ఇంటి చుట్టూ పోలీసులు పహార కాస్తున్నారు. గాంధీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశముండడంతో పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరింపుతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు స్థానికులు తెలిపారు. అటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఆయన కుమారుడు, సోదరుడు, ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు వారిపై 109(1), 189, 191(2), 191(3), 132, 329, 333, 324(4), 324(5), 351(2) సెక్షన్‌ల కింద అభియోగాలు మోపారు.