17 April, 2026 | 12:11 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

విశ్వహిందూ పరిషత్ కార్యదర్శిగా సంతోష్

16-06-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 15(విజయక్రాంతి): విశ్వ హిందు పరిషత్ కార్యద ర్శిగా ఆకుల సంతోష్‌ను నియమించినట్లు ధనుంజయ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శిశు మందిర్‌లో ఆదివారం నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ సమావే శా నికి ఆయన  ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు.

రానున్న రోజుల్లో హిందూ సమాజంలోని అస్పృశ్యత అంటరానితనం  తొల గించి నిమ్న వర్గాలలో చైతన్యం నింపేందుకు  సామాజిక సమరసత రథయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జనగామ (ఆసిఫాబాద్) ప్రఖండ కార్యదర్శిగా ఆకుల సంతోష్, సహకారదర్శిగా మురుముర్ వార్ రాజును నియమించారు.

ఈ సమావేశంలో పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, జిల్లా అధ్యక్షులు రేవల్లి రాజలింగు, జిల్లా ఉపాధ్యక్షురాలు గొట్టిపర్తి కనకతార,జిల్లా కార్యదర్శి వేముల రమేష్, విపిన్ లోధా, రాపర్తి నవీన్, వైభవ్, సింహాద్రి, బజరంగ్‌దళ్ జిల్లా సహా సంయోజక్  మురళీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.