26-05-2025 02:51:14 PM
న్యూఢిల్లీ: వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేందుకు అందుబాటులోకి మరో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి జితేంద్రసింగ్(Union Minister Jitendra Singh Rana) 'భారత్ ఫోర్ కాస్ట్ సిస్టం'ను(Bharat Forecast System launched) సోమావారం నాడు జాతికి అంకితం చేశారు. ఈ వ్యవస్థతో ముందస్తు సమాచారం మరింత ముందుగా తీసుకునే అవకాశముంది. గతంలో 6 కిలో మీటర్లు అయితే ఇప్పుడు 12 కిలో మీటర్లు ముందుగానే తీసుకోవచ్చని ఐఎండీ వెల్లడించింది. కొత్త వ్యవస్థ ద్వారా గ్రామాల వారీగా అంచనాలు ఇవ్వవచ్చని ఐఐటీఎం పుణె డైరెక్టర్(Director of IITM Pune) తెలిపారు. ఐదు రోజుల ముందుగానే పక్కా సమాచారం ఇవ్వనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు వచ్చాయని ఐఎండీ డైరెక్టర్ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈసారి సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది.
అటు నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అంచనా వేసిన సమయానికంటే ముందుగానే తెలంగాణలోకి ఎంటర్ అయ్యాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో నైరుతి తెలంగాణలోకి ప్రవేశిస్తోంది. తెలంగాణలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.