calender_icon.png 31 May, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్తంగా వెయ్యి దాటిన కరోనా కేసులు

26-05-2025 02:15:21 PM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు(COVID-19) వేగంగా పెరుగుతున్నాయి. ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మే 26 నాటి రోజువారీ కొవిడ్ యాక్టివ్ కేసులు(Covid Active Cases) 1,000 దాటాయని తెలిపింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్ లో 83, కర్నాటకలో 47, ఉత్తర్ ప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ లో12 కేసులు నమోదయ్యాయి. తాజాగా కొవిడ్ మహమ్మారి(COVID-19 pandemic) కారణంగా దేశంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మే 19 నుండి కోవిడ్ తో మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్నాటకలో 1 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో కొత్త కోవిడ్-19 సంబంధిత మరణాలు నమోదయ్యాయి.థానేలో, ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల కోవిడ్-19 రోగి మరణించినట్లు థానే మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. 

యాక్టివ్ కేసులలో స్వల్ప పెరుగుదలను చూపించే ఇతర రాష్ట్రాలు:

కర్ణాటక – 47 యాక్టివ్ కేసులు (+34), తమిళనాడు – 69 యాక్టివ్ కేసులు (+3), గుజరాత్ – 83 యాక్టివ్ కేసులు (+76), ఉత్తరప్రదేశ్ – 15 యాక్టివ్ కేసులు (+15), రాజస్థాన్ – 13 యాక్టివ్ కేసులు (+11). ఐదు రాష్ట్రాల్లో మరణాలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ  ప్రకటించింది.