03-02-2026 07:56:14 PM
గ్రామ సరిహద్దులు,ప్రభుత్వ భూముల సర్వే తర్వాత రైతుల పట్టా భూములు సర్వే చేపడతాం: ఆర్డీవో శ్రీనివాసులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): ఆర్ఓఆర్ యాక్ట్ భూభారతి రీ-సర్వేతో రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. ఆర్ఓఆర్ యాక్ట్ (భూ భారతి)–2024 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ–సర్వే పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని గానుగబండ గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిగా పాల్గొని మాట్లాడుతూ రీ–సర్వేతో భూ రికార్డుల శుద్ధి జరిగి రైతులకు స్పష్టమైన హక్కులు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.
రీ–సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా,దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు.ముందుగా గ్రామ సరిహద్దుల నిర్ణయించి అనంతరం ప్రభుత్వ భూముల సర్వే,ఆ తర్వాత రైతుల పట్టా భూముల సర్వే చేపడతామని వివరించారు.రైతులు సహకరించి రి సర్వేను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గానుగుబండ సర్పంచి కడియాల పద్మ అప్పయ్య,కొండాయిగూడెం సర్పంచ్ కందుల మంగమ్మ కోటిరెడ్డి,సర్వే డివిజనల్ ఇన్స్పెక్టర్ వంశీ,తహసీల్దార్ స్రవంతి మండల సర్వేయర్ భాస్కర్,ఆర్ఐ లు ప్రవీణ్,రాంబాబు,కృష్ణవేణి గ్రామ పాలన అధికారులు,రెవెన్యూ అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.