17-06-2025 04:20:04 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్(Former MPP Baleshwar Goud) కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్, ఖలీంతో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బసవన్న, తిరుపతి, శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.