17-06-2025 04:23:16 PM
సబ్ కలెక్టర్ కు వినతి..
కాగజ్ నగర్ (విజయక్రాంతి): జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.49 వెంటనే రద్దు చేయాలని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల(Sub-Collector Shradha Shukla)కు వినతిపత్రం అందజేసారు. అనంతరం కాగజ్ నగర్ తహసిల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ జీవో నెంబర్ 49 కాపీకి నిప్పంటించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ... జీవో నం.49తో జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడి, ప్రజలకు జీవనోపాధి కరువు అవుతుందని తెలిపారు. స్థానికులను, గిరిజనులను గ్రామస్తులను సంప్రదించకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నిదర్శనం అని తెలిపారు.
వెంటనే ఈ జీవో నెం.49ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చేరాల శ్రీనివాస్, కొండు తిరుపతి, పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు వెంకటేష్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వలపదాసు శ్రీదేవి, బిజెపి సీనియర్ నాయకులు గజ్జల లక్ష్మణ్, సర్పంచ్ దోతుల శ్రీనివాస్, ఎంపిటిసి పెరిసింగుల తిరుపతి, మాజీ ఎంపీటీసీ నూనె సంపత్ కుమార్, కోట వేణు, బీమాన్ కార్ బాపూరావు, రావుల నరేష్, సీనియర్ నాయకులు గురిజాల మొండి, యువ నాయకులు ముక్కెర శేఖర్, వంజిరి డోంగ్రే కార్తిక్, అగ్గిల శ్రీనివాస్, అశోక్, లొనారి రవీందర్, నిక్కోడే ప్రభాకర్, కొప్పుల సుధాకర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.