15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రైతు హక్కుల భరోసా భూభారతి..

29-04-2025 09:31 PM

ఆర్థిక భరోసా ధాన్యం కొనుగోలు...

అదనపు కలెక్టర్ మోతిలాల్..

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం రైతు హక్కుల భరోసా అయితే వరి ధాన్యం కొనుగోలు ఆర్థిక భరోసా అని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(District Additional Collector Sabavat Motilal) అన్నారు. మంగళవారం ఆయన రైతులతో మాట్లాడుతూ.. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కోసం 332 కొనుగోలు కేంద్రాలు కేటాయించగా ఇప్పటి వరకు121 కేంద్రాల ద్వారా 21,143 టన్నుల ధాన్యం 2,395 రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. హిందువుగాను రైతుల అకౌంట్లలో 5.73 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న ప్యాడి క్లీనర్లు, తేమ పరికరాలు, హస్క్ రిమూవర్లు తదితర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.