15-08-2025 09:08:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలుగా పెంబికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యురాలు బి.జాను బాయినీ నియమిస్తూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కే.కవిత ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కమిటీలో అన్ని జిల్లాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయగా నిర్మల్ జిల్లాకు జాను భాయ్ ని ఎంపిక చేశారు.