27 June, 2026 | 7:43 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

బైక్ దొంగ అరెస్టు.. చోరీ చేసిన వాహనం స్వాధీనం

09-05-2026 08:07 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): బైక్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, చోరీ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25-01-2026న వెంకట్రావుపేట గ్రామానికి చెందిన నాలుక శంకర్ తన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ (నంబర్: TS23D3211)పై సంధు సాయి కుమార్ (24)కు లిఫ్ట్ ఇచ్చాడు.

అనంతరం బావుసాయిపేట గ్రామంలోని మొబైల్ షాప్ వద్ద బైక్ నిలిపి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, సంధు సాయి కుమార్ చోరీ చేసిన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌తో వేములవాడ వైపు వెళ్తుండగా పట్టుకున్నారు. అనంతరం బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించిన్నట్లు ఎస్ఐ కె ప్రశాంత్ రెడ్డి తెలిపారు.