29 April, 2026 | 6:09 PM

పంటను కాపాడుకునే ప్రయత్నంలో రైతు వేసిన వలలకు చిక్కి అరుదైన పక్షుల మృతి

29-04-2026 03:35 PM

బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండల కేంద్రం సమీపంలోని దాబా హోటల్ వెనుక అడవిని ఆనుకుని ఉన్న చేనులో ఉన్న పంటను కాపాడుకునేందుకు ఓ రైతు పంట చేను చుట్టూ వలలు వేయడం జరిగింది. అయితే అటవీ సమీపంలో ఉన్న చేనులోకి రామచిలకలతో పాటు వివిధ రకాల అరుదైన జాతుల పక్షులు వచ్చి వలలో చిక్కుకుంటున్నాయి.

వలలు చిక్కుకున్న పక్షులు ఎండల తీవ్రతతో అక్కడికక్కడే మృతి వాత పడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు రైతుకు కౌన్సిలింగ్ ఇచ్చి వలను తొలగించే విధంగా చేయాలని పలువురు కోరుతున్నారు. పంటను రక్షించుకునేందుకు రైతు వేసిన వల పక్షులకు ప్రాణ సంఘటనగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.