28-11-2025 08:23:56 PM
పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికిన భాస్కర్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. బీర్కూర్ మండల పరిధిలోని బైరాపూర్ గ్రామానికి చెందిన BRS పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలు జోగు నర్సింలు, పందుల సుధాకర్, గుడి కొండ సాయిలు, కొండు పండరి, తుకారాం, కమ్మరి బాబు,దుర్గయ్య, హన్మండ్లు, కొండ్రరాములు,పోతురాజు రాజు, నిరుడి రాజు, లస్మాపురం దశరథ్ గార్లు బాన్సువాడ లోని నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండలం ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.