11-02-2026 02:51:57 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఎన్నికల కోడ్ నిబంధనలను అతిక్రమించి ప్రచారం చేస్తున్నారన్న నెపంతో ఎమ్మెల్యేను తరిమికొట్టిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు లో చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియడంతో జుక్కల్ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి బిచ్కుంద మున్సిపాలిటీలో తొమ్మిదవ వార్డులో ఓ ఇంటి లోకి ప్రచారానికి వెళ్లారు. చూసిన ప్రతిపక్ష పార్టీల వారు, వార్డు ప్రజలు ప్రచారాన్ని అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుందలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున రాత్రి 9 గంటలకు ప్రచారానికి వెళ్లడంతో స్థానికులు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే పోలీసుల సహకారాన్ని తీసుకొని వెళ్లిపోయారు. నిబంధన లను ఉల్లంగించిన ఎమ్మెల్యేపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు డిమాండ్ చేశారు.ర