4 April, 2026 | 1:48 PM

Breaking News

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •   పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి, ముగ్గురికి గాయాలు   •  

అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే..

11-02-2026 02:48 AM

రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో మంత్రి, అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు గిరిజన అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం దారుణమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విచా రం వ్యక్తం చేశారు. మంగళవారం మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనను రాజ్యసభలో ప్రస్తావించినట్లు తెలిపారు. గెలవడం ఖాయం...గెలిచిన తర్వాత కూడా తనను అధికార పార్టీ వేధిస్తుందని, తన భార్యతో స్పష్టంగా చెప్పి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

ఈ దారుణ సంఘటనను సభా ముఖంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చానన్నారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రాజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా దురాగతాలకు పాల్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.