30-06-2025 01:44:44 AM
కరీంనగర్ క్రైం, జూన్ 29 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగియడంతో డివిజన్ హద్దుల కాల పరిమితి చెల్లడంతో ప్రభుత్వం వార్డుల పునర్విభజన జరిపి అందరి అభ్యంతరాలు స్వీకరించి తిరిగి డివిజన్ ల ఏర్పాటు పూర్తి చేయడం జరిగిందని ఇందులో అధికార పార్టీ కి ఏం సంబంధం ఉందని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ అన్నారు.
ఆదివారం డీసీసీ కార్యాలయంలో మాట్లాడుతూ బీజేపీ, బీ ఆర్ ఎస్ నేతలు పారదర్శకంగా ఎన్నికల్లో పాల్గొని గెలిచే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు సునీల్ రావు బీజేపీ లో చేరి, సర్దార్ రవీందర్ సింగ్ తిరిగి బి ఆర్ ఎస్ లో చేరి కుమ్మక్కయ్యి నగరపాలక ఎన్నికల్లో దొంగాట ఆడటానికి సిద్ధమయ్యారని, వీరి వింత చేష్ఠలను చూసి నగర ప్రజలు నవ్వుకుంటున్నారని సుజిత్ కుమార్ ఎద్దేవా చేశారు.