07-06-2025 10:23:08 PM
తూప్రాన్ (విజయక్రాంతి): భారత ప్రధాని మోడీజీ 11 ఏళ్ల అభివృద్ధి సాధనలకు గుర్తుగా తూప్రాన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించిన నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు, ఆయన స్వచ్ఛమైన పరిపాలన విధానములో 11 సంవత్సరాలను విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటారు. దేశ పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛభారత్ ను, నిర్వహించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా నాటిన మొక్కల యొక్క ప్రాధాన్యతను గూర్చి బిజెపి నేతలు వివరించారు. ఇందులో పట్టణ అధ్యక్షులు జానకిరామ్ గౌడ్, తాటి విట్టల్, నరసింహారెడ్డి, మధుసూదన్, తదితరులు ఉన్నారు.