07-06-2025 10:17:44 PM
తూప్రాన్ (విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం(Manoharabad Mandal) రామయపల్లి సమీపంలో గల కాకతీయ పైపుల కంపెనీలో శుక్రవారం పనిచేయుటకు వెళ్లి తిరిగి రాలేదని తన భార్య కాలకంటి శ్వేత తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి, కాలకంటి సురేష్(28), తండ్రి సత్తయ్య తూప్రాన్ నివాసి గత ఆరు సంవత్సరాల క్రితం శ్వేతతో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
బ్రతుకుదెరువు నిమిత్తం రామాయపల్లి ప్రైవేట్ కంపెనీలో పనిచేయుచు జీవనం కొనసాగిస్తున్నాడు, అయితే శుక్రవారం ఉదయం కంపెనీలో విధులు నిర్వహించే క్రమంలో వెళ్లి తిరిగి రాలేదని తన భర్తకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసి వుండడంతో సమీప బంధువులను అడిగిన ఆచూకీ తెలియరాలేదని తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా భార్య శ్వేత ఫిర్యాదు చేసింది, తూప్రాన్ పోలీసులు దరఖాస్తు స్వీకరించి కేసు నమోదు చేశారు.