15 June, 2026 | 1:56 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల‌కు బీజేపీ నాయ‌కుల నిర‌స‌న

01-11-2025 08:37 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో దేశ సైనికులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల‌కు నిర‌స‌నగా శ‌నివారం నాడు రాత్రి మండ‌లంలోని బుదేరా చౌర‌స్తాలో మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడు నాగిశెట్టి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న  తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ సైనికులను కించపరిచే విదంగా పరుష పదజాలంతో మాట్లాడడం సిగ్గు చేట‌న్నారు. ఆపరేషన్ సింధూర్ చేసి దేశ గౌరవాన్ని పెంచి  పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించి ప్రపంచానికి మన దేశ సైనిక శక్తిని ప్రపంచానికి చెప్పిన మ‌న దేశ సైనికుల‌ను  సీఎం హోదాలో ఉండి  కించ‌ప‌ర్చ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వెంట‌నే  సీఎం రేవంత్ రెడ్ దేశ సైనికులకు, దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి బీజేపీ  డిమాండ్  చేస్తుంద‌న్నారు.