calender_icon.png 2 November, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల పెండింగ్ క్లైములను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

01-11-2025 08:39:02 PM

నేరేడుచర్ల (విజయక్రాంతి): కార్మికుల పెండింగ్ క్లైములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నేరేడుచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు యారవ శ్రీనివాస్ అన్నారు. శనివారం నేరేడుచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్మికుల ముఖ్య సమావేశంలో మాట్లాడుతూ... నిత్యం ఎంతో కష్టపడి పనులు చేస్తున్న కార్మికులందరూ ప్రతి సంవత్సరం సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు.

ప్రభుత్వం కార్మికులకు భరోసా కల్పించాలని, సంక్షేమ బోర్డు నుండి ప్రమాద బీమా 10 లక్షలు, సాధారణ బీమా 2 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అడ్డాలలో మౌలిక వసతులు కల్పించాలని, వెల్ఫేర్ బోర్టులోని నిధులను కార్మికులకే ఖర్చు చేయాలన్నారు. లేబర్ కార్యాలయాలలో అధికారులను నియమించి కార్మికులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్, కోశాధికారి గుంజ రవీందర్, కోటేశ్వరరావు, షరీఫ్ అజయ్ కుమార్, కరీముల్లా, సైదా, మట్టయ్య, నరేష్, శ్రీను, నాగమ్మ, కొండలు, కరుణాకర్ తదితర కార్మికులు పాల్గొన్నారు.