14-06-2025 05:39:45 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్ప సభ కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలంలోని పులి గుండు తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బాన్సువాడ మండల పార్టీ అధ్యక్షుడు మజ్జిగ శ్రీనివాస్ ,మాజీ అధ్యక్షులు సాయిబాబా, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజ్, బూత్ అధ్యక్షులు మోహన్, పులి గుండు తండా మాజీ సర్పంచ్ ఉషా నాయక్, సురేష్, దత్తు, రాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.