12 March, 2026 | 11:59 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మున్సిపాలిటీ సమస్యలపై బీజేపీ నిరసన

19-01-2026 03:46 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమ వారం గాంధీ చౌక్ నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మున్సిపాలిటీ కమిషనర్ కి లక్షెట్టిపేట బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ లక్షెట్టిపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లు పగిలి డ్రైన్ వాటర్ పైపుల్లోకి చేరి ఇళ్లలోకి వస్తుందని, వాటిని తాగునీటిగా వాడడంతో ప్రజలు తీవ్ర అస్వస్థత కు గురవుతున్నారన్నారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణ సరిగ్గా చేయకపోవడం, నాలీల్లో మురుగు నీరు జమై దోమలు వృద్ధి చెంది ప్రజలు వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. మున్సిపాలిటీలో అత్యధిక టాక్స్ లు వసూలు చేస్తున్నారు, కానీ అందుకు తగిన వసతులు మాత్రం ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.