19-01-2026 03:43:17 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నీల్కుర్తి రెవెన్యూ గ్రామపంచాయతీ నందు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖమ్మం జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ సాయి చరణ్ పటేల్ అమ్మమ్మ గొప్పగాని లచ్చమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ నెహ్రూ నాయక్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి వెంట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.