11-11-2025 12:00:00 AM
ఖమ్మం టౌన్, నవంబర్ 10 (విజయ క్రాంతి):ఖమ్మం 1 వ పట్టణ అధ్యక్షులు గడీల నరేష్ అధ్యక్షతన 1 వ పట్టణ సి ఐ ని కలిసి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టి జాతీయ ప్రధానకార్యదర్శి, కేం ద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ పై అనుచిత వాక్యాలు చేస్తూ వాట్సాప్ప్ లో పోస్ట్ లు పెట్టిన వ్యక్తి పై చ ర్యలు తీసుకోవాలని సోమవారం వినతిపత్రం అందజేశారు.
వ్యక్తిగత దూషణలు చే స్తూ వారి ఫోటో ని సామజిక మధ్యమాల లొ గ్రూప్ లలో పెట్టి అనుచిత వ్యాఖ్యలు చే స్తూ వారి ప్రతిష్ట కు భంగం కలిగించే విధ ంగా స్థానిక బైపాస్ రోడ్డు ఏరియా వేణుగోపాల్ నగర్ రోడ్డు నెంబర్ 1 లొ నివాస ముంటున్న వ్యక్తి రెచ్చగొట్టే విధముగా పోస్ట్ లు పెట్టినందున అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగా వారు కోరారు. ఈ కార్యక్రమం లొ టౌన్ అధ్యక్షులు గడీల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా, జిల్లా నాయకులు మంద సరస్వతి, పొట్టిమూతి జనార్దన్, బండారు శ్రీనివాస్, మండల నాయకులు పాలేపు రాము, పొట్టిమూతి వాణి, ఊరుకొండ ఖాదర్,మేడ సంపత్, బొల్లోజు మనోజ్, గార్లు పాల్గొనటంజరిగింది.