16 April, 2026 | 10:44 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బీజేపీ అంతుచూస్తా!

26-11-2025 12:23 AM
  1. బెంగాల్ ముఖ్యమంత్రి మమత వార్నింగ్ 
  2. ‘సర్’ ప్రక్రియపై తీవ్ర విమర్శలు
  3. కేంద్రానికి ఈసీ సహకరిస్తోందని ఆరోపణలు

కోల్‌కతా, నవంబర్ 25: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గానీ, టీఎంసీనీ శ్రే ణులను గానీ టా ర్గెట్ చేస్తే బీజేపీ అంతుచూస్తా. నా అనుచరులు, పార్టీ శ్రేణులపై జరిగే దాడులను నాపై జరిగినట్లు భావిస్తా. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేస్తా’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. ఈసీ బెంగాల్ చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం కోల్‌కతాలో నిర్వహించిన సభలో ఆమె బీజేపీపై నిప్పులు చెరిగారు.

‘సర్’ ప్రక్రియ బీజేపీ కనుసన్నల్లో జరుగుతున్నదని ఆరోపించారు. మున్ముందు ఎన్నికలు ఉన్నందువల్లే బీజేపీ మళ్లీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మాట్లాడుతోందని, మతపరమైన కార్డును వినియోగించుకుంటున్నదని మండిపడ్డారు. ధర్మం పేరుతో బీజేపీ అధర్మాన్ని ఆచరిస్తోందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఏజెన్సీలు, వనరులను వాడుకున్నా, బీజేపీ తనతో పోరాడి గెలవలేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.