31-12-2025 01:40:58 AM
సంస్థాన్ నారాయణపూర్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 11 వ వార్డులో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి హాజరయ్యారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టుగిరి, 11వ వార్డు సభ్యులు చింతల శైలజ సత్యనారాయణ లతో కలిసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా మాతృదేవోభవ ఆశ్రమం పనిచేస్తుందని ఉప్పల లింగస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బల్గురి శివ, నీళ్ల అనిత శంకర్, చిలువేరు రమాదేవి శంకర్, పట్నం బాలకృష్ణ, రాచకొండ రమేష్ బాబు, భూపని బలరాం, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, బోయ శంకరయ్య, బొడ్డు పెళ్లి లోకనాథం, ఈసం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.