calender_icon.png 1 August, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

46వ సారి రక్తదానం

14-05-2025 12:00:00 AM

కామారెడ్డి, మే 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రమౌళికి హైదరాబాద్ లోని యశోద వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్‌రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 46 వ సారి రక్తదానం చేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ర్ట చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలను తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట రక్తం అవసరం ఉంటుందని రక్తదాతలు మానవత దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తం అందజేస్తే ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు.