15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భార్య మరణించిందని మనోవేదనతో భర్త ఆత్మహత్య..

13-05-2025 10:50 PM

బోథ్ (విజయక్రాంతి): భార్య మరణంతో ఒంటరితనంతో కృంగిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బోథ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రెండ్లపల్లి గ్రామానికి చెందిన మెస్రం వెంకటేశ్వర్ భార్య గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పటి నుండి భార్యలేదని మనోవేదన చెందుతూ ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఏకాంతంగా గడిపేవాడు. చివరకు జీవితంపై విరక్తి చెంది మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తండ్రి మెస్రం సుదర్శన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.