calender_icon.png 9 June, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరున్నర గంటలు.. ఇరవైనాలుగు శుభకార్యాలు

09-06-2025 12:23:30 AM

  1. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలను చుట్టేసిన మంత్రి పొంగులేటి సతీమణి మాధురి 

ఆలయ విగ్రహా ప్రతిష్టా మహోత్సవాలకు హాజరు

వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వాదం

ఖమ్మం,, జూన్ 8(విజయ క్రాంతి) : ఆదివారం ఉదయం సమయం తొమ్మిదిన్నర గంటలు పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం సీత్యా తండాలో అభయఅంజనేయస్వామి విగ్రహా ప్రతిష్టకు హాజరు కార్యక్రమంతో ప్రారంభమైన తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి పర్యటన అక్కడ నుంచి నిర్విరమంగా సుమారు ఆరున్నర గంటలపాటు పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో కొనసాగింది.

పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన ఆలయ విగ్రహా ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. వివాహ వేడుకలకు హాజరై నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పంచెకట్టు, ఓణీల అలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారులను దీవించారు.

ఇలా ఆదివారం రోజంతా ఆయా ప్రాంతాల్లో జరిగిన శుభకార్యాలకు హాజరవుతూ బిజీబిజీగా గడిపారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం బికారి తండా, సీత్యా తండా, నాయకన్ గూడెం, పాలేరు, చేగొమ్మ గ్రామాల్లో, నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం, పైనంపల్లి, గువ్వలగూడెం గ్రామాల్లో, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమళ్ల, సత్యనారాయణ పురం, కరుణగిరి, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెం, ఎఫ్ సీ ఐ గోదాం, ఖానాపురం, బల్లేపల్లి, శ్రీనగర్ కాలనీ, రాపర్తినగర్ , గోపాలపురం, మమత రోడ్ తదితర ప్రాంతాల్లో జరిగిన శుభకార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పుష్పగుచ్ఛాలు... మంగళ హారతులతో ఘనస్వాగతం.... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటున్న లబ్ధిదారుల వద్దకు... వివాహ వేడుకలు, ఇతర శుభకార్యక్రమాలు జరుపుకుంటున్న ఇండ్లకు, ఫంక్షన్ హాళ్లకు స్వయంగా మంత్రి పొంగులేటి సతీమణి విచ్చేయడంతో కార్యక్రమ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

పొంగులేటి సతీమణి మాధురి అడుగుపెట్టిన ప్రతీ చోట నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు... మంగళ హారతులు ఇచ్చి, శాలువాలు కప్పి సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.