11 May, 2026 | 8:30 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •   గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వార్డ్ సభ్యులు   •   ఎంఈఓ చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ ప్రారంభం   •   మిల్లుల వద్ద వరి ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలి   •   ప్రజావాణికి భూకబ్జాల భాగోతం   •   ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య   •  

నాభి శిల బొడ్రాయి ప్రాణ ప్రతిష్ఠ

11-05-2026 07:50 PM

- అంగరంగ వైభవంగా ఉత్సవాలు 

కొండపాక: కుకునూరుపల్లి మండల కేంద్రంలో సోమవారం నాభి శిల (బొడ్రాయి) ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలోని వందల ఏళ్ల నాటి పురాతన నాభి శిలను వెలికితీసి, గ్రామ నడిబొడ్డున నూతన నాభి శిల, పోతలింగేశ్వర స్వామి విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. పాండురంగ ఆశ్రమ గురువులు విఠల్ శర్మ పర్యవేక్షణలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య యంత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లం కనుకవ్వ ఐలయ్య, ఉప సర్పంచ్ దోంతి సత్తయ్య, మాజీ సర్పంచ్ కాసం నవీన్ కుమార్, పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరేందర్, పాక్స్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్, మాజీ ఎంపిటిసిలు ఇండ్ల కనకయ్య , భూరమైన భూములు గౌడ్  ఇతర ప్రజాప్రతినిధులు  గ్రామస్థులు పాల్గొన్నారు.