11 May, 2026 | 8:43 PM

Breaking News

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి   •   ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్‌టాప్ ప్రదానం   •   కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ   •   ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •  

పది మండల టాపర్ కు రవీంద్ర భారతిలో సన్మానం

11-05-2026 07:48 PM

పాపన్నపేట: హైదరాబాదులో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే ప్రతిభా పురస్కారానికి చికోడ్ లింగాయిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి వెల్లడించారు , ఇందులో భాగంగా సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డిని ప్రముఖులు సన్మానించారు. ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో హర్షవర్ధన్ రెడ్డి పాపన్నపేట మండల్ టాపర్ గా నిలిచాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్ గా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సోమవారం రవీంద్రభారతిలో సన్మానం నిర్వహించినట్లు పాఠశాల గజిటెడ్ హెడ్మాస్టర్ విజయలక్ష్మి వివరించారు.