07-06-2025 10:28:27 PM
పిట్లం మండలం చిన్న కొడప్గల్ లో ఘటన..
రెడ్డి చెరువులో మృతదేహం లభ్యం..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ గ్రామ కార్యదర్శి హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) పిట్లం మండలం చిన్నకోడప్గల్ గ్రామ కార్యదర్శి గా పనిచేస్తున్న కృష్ణ(35) గత రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. శనివారం ఉదయం పిట్లం మండలం చిన్న కోడప్గల్ రెడ్డి చెరువులో కృష్ణ మృతదేహం లభ్యమైంది. కృష్ణ తలపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్య జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టారు. సంబంధిత అధికారులు పరిశీలించారు. పిట్లం మండలం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా మృతుడి కృష్ణది పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని జగదాంబ తండావాసి అని తెలిసింది. హత్యకు గురయ్యాడా లేక ఏమైంది అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.