02-02-2026 05:25:45 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల స్థాయి సీఎం కప్పు క్రీడాల్లో భాగంగా మండలంలోని జెడ్పిహెచ్ఎస్ బొల్లారం పాఠశాల విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచారని పాఠశాల పిడి.సుకుమార్ తెలిపారు. కబడ్డీ, కోకో పోటీల్లో బాలురు మొదటి స్థానం, కోకో, వాలీబాల్ పోటీలో బాలికలు మొదటి స్థానం, పరుగు పందెం 100 మీటర్లు మొదటి స్థానంలో పాఠశాల విద్యార్థులు నిల్చారని పిడి.సుకుమార్ తెలిపారు. మండల స్థాయిలో నిలిచిన సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్, ఉపాధ్యాయుల బృందం పిడి. సుకుమార్ను విద్యార్థులు,గ్రామస్తులు సమక్షంలో ఘనంగా శాలువతో సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ ఇలాగే విద్యార్థులు క్రీడాలో మరింత ప్రతిభను కనబరిచి పైస్థాయికి ఎదగాలని తెలిపారు. ఒక విద్యార్థికి ఒక కళ ఉంటుంది ఇప్పటినుండే విద్యార్థి అనేది ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగితే బంగారు భవిష్యత్తు బాగుంటుందన్నారు. అప్పుడు తల్లిదండ్రులకు, గ్రామానికి, మండలానికి గర్వంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.