calender_icon.png 2 February, 2026 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మఠంపల్లి మండలానికి మందకృష్ణ మాదిగ రాక

02-02-2026 05:29:09 PM

మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఈనెల 4న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో నిర్వహించే మండల సభకు మంద కృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రభు తెలిపారు. సోమవారం మఠంపల్లి మండల కేంద్రంలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కోదాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో ప్రధాన కారకులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.చిలుకూరు ఎస్సె సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అఖిల పక్ష పార్టీల మండల అధ్యక్షులు,బీసీ నాయకులు,ప్రజాసంఘాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.