09-12-2025 01:57:21 PM
హైదరాబాద్: తెలంగాణ సీఎంఓ, లోక్భవన్కు బాంబు బెదిరింపు ఈమెయిల్ అందడంతో హైదరాబాద్ పోలీసులు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వాసుకి ఖాన్ అనే దుండగుడు గవర్నర్ కార్యాలయానికి ఒక ఇమెయిల్ పంపాడు. అందులో కార్యాలయాన్ని పేల్చడానికి కుట్ర జరుగుతోందని తెలిపాడు. ఆ ప్రాంగణాన్ని తనిఖీ చేయడానికి బాంబు నిర్వీర్య దళాన్ని రంగంలోకి దించారు. సోమాజిగూడలోని ప్రజా భవన్కు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. లోక్ భవన్, ప్రజా భవన్లను క్షుణ్ణంగా శోధించిన తర్వాత, బాంబు నిర్వీర్య దళం అది నకిలీ ఇమెయిల్ అని ప్రకటించింది. అయితే, దీని వెనుక ఉన్న వారిని గుర్తించడానికి పంజాగుట్ట పోలీసులు ఈమెయిల్ మూలాన్ని పరిశీలిస్తున్నారు. గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) కు మంగళవారం అమెరికాకు వెళ్తున్న విమానంలో బాంబు అమర్చారని మరో బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఒక మిలియన్ డాలర్లు చెల్లించకపోతే పేలుడు పదార్థాన్ని పేల్చివేస్తామని వ్యక్తి హెచ్చరించాడు. ఈ సందేశం విమానాశ్రయ అధికారులలో వెంటనే ఆందోళన కలిగించింది.