22-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): బోనాల ఉత్సవాల సందర్భం గా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 29 వరకు ఐదు రోజులపాటు బీసీ కళాకారులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, విక్రయశాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీన్ని ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న మైదానంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉం టుందని పేర్కొన్నారు.