14-11-2025 12:00:00 AM
కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు
కుత్బుల్లాపూర్, నవంబర్ 13 (విజయక్రాంతి): చదువు కోవడానికి అమ్మ మ్మ, తాతయ్య దగ్గరకు వచ్చిన బాలుడు బిల్డర్ నిర్లక్ష్యం వలన మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుం బ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం, కుకునూర్ గ్రామానికి చెందిన దుంపల నవీన్, మీనా దంపతులకు ఆకాష్ (7) సంతానం.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భౌరంపేట్ లోని విఎన్ఆర్ వెంచర్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లోని పనిచేస్తున్న అమ్మ మ్మ, తాతయ్య దగ్గరే ఆకాష్ ఉంటూ గాయ త్రి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నా డు. గురువారం అపార్ట్మెంట్ దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గేట్ మీద పడడం తో తలకి తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. బిల్డర్ నిర్లక్ష్యం వల్లనే ప్ర మాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.