పెద్దాయపల్లిలో.. తల్లిపాల వారోత్సవాలు
08-08-2026 03:21 PM
బాలానగర్: మండలంలోని పెద్దాయపల్లి గ్రామంలో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. గాయత్రి లక్ష్మయ్య పాల్గొని గర్భిణీలకు రోజు తీసుకునే ఆహారం శుభ్రంగా ఉండాలని, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న గుడ్లు, బాలామృతం పిల్లలకు తినిపించాలన్నారు. గర్భిణీలు అంగన్వాడి సెంటర్ కు వచ్చి ఫుడ్డు తీసుకున్నట్లయితే మీకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సరిత, విష్ణు, అంగన్వాడి టీచర్ రేణుక ఆశా వర్కర్ విజయలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.






