calender_icon.png 17 June, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుణెలో కూలిన వంతెన..

16-06-2025 01:59:13 AM

  1. నదిలో పడిపోయిన పర్యాటకులు
  2. నలుగురు మృతి, 32 మందికి గాయాలు 
  3. వంతెన పాతది కావడమే ప్రమాదానికి కారణం
  4. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

పుణె, జూన్ 15: పుణెలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతవగా.. నలుగురు చనిపోగా, 32 మంది గాయపడ్డారు. ఇంద్రాయణి నదిపై ఉన్న tవంతెన కూలడంతో దాదాపు 20 మంది పర్యాటకులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించిన నున్నట్టు సీఎం ప్రకటించారు. 

పర్యాటకులు పోటెత్తడం వల్లే.. 

ఆదివారం సెలవు దినం కావడంతో పుణె జిల్లాలోని ఇంద్రాయణి నదిపై ఉన్న కుందమాలా ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తారు. చాలా మంది అక్కడున్న వంతెనపై నిల్చుని ఉండగానే.. వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద విషయంగానే తెలియగానే ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా అప్పటికే చాలా మంది గల్లంతయ్యారు. ఈ వంతెనను 30 ఏండ్ల కింద నిర్మించినట్టు ఓ ప్రజాప్రతినిధి పేర్కొన్నారు.