12 April, 2026 | 2:03 PM

నీతి, నిజాయితికి పట్టం కట్టారు

12-04-2026 12:26 PM

- మాజీ ఎంఎల్ఏ పుట్ట మధు

మంచిర్యాల,(విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీ ప్రజలు నీతికి, నిజాయితీకి పట్టం కట్టారని మాజీ ఎంఎల్ఏ పుట్ట మధు పేర్కొన్నారు. ఆది వారం క్యాతనపల్లిలోని మాజీ ఎంఎల్ఏ బాల్క సుమన్ నివాసంలో ఇటీవల విజయం సాధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను, చైర్మన్ అభ్యర్థిని సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పాలనను చూసి విసిగి పోయిన ప్రజలు మార్పును కోరుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. వేల కోట్లు ఉన్న చెన్నూర్ నియోజక వర్గ ఎంఎల్ఏ డబ్బుతో అందరిని కొనచ్చని చూసినా, లొంగకుండా ప్రజలు, పార్టీ మద్దతుతో విజయం సాధించిన బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు నిజాయితీగా నిలబడి క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సంధ్యా రాణి, బిఆర్ఎస్ నాయకులు రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.