కాంగ్రెస్‌లోకి మడుపు భూంరెడ్డి

28-04-2024 01:06:03 AM

సిద్దిపేట, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుంచి మరో బీఆర్‌ఎస్ నేత శనివారం కాంగ్రెస్‌లో చేరారు. హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఫుడ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.