calender_icon.png 6 June, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్

04-06-2025 12:56:52 PM

కేసీఆర్ ది గట్టి గుండె.. కాబట్టే కాళేశ్వరం కట్టారు.

హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి( Telangana Jagruthi) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు. ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha), జాగృతి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని కవిత ఆరోపించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు? అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే.. మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని కవిత సూచించారు.

తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా? అంటూ కవిత ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అన్నారు. కాళేశ్వరం పూర్తియితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందని చెప్పారు. కేసీఆర్ ది గట్టి గుండె కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కుట్ర చేస్తోందని కవిత తెలిపారు. కేసీఆర్ ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్ వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డకు చిన్నచిన్న మరమ్మత్తులు చేయట్లేదని కవిత మండిపడ్డారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి(CM Anumula Revanth Reddy) ఎందుకు స్పందించట్లేదని కవిత ప్రశ్నించారు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును అడ్డుకోవాలని కవిత డిమాండ్ చేశారు. బీజేపీలో ఉన్న తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్(Eatala Rajendar) కూడా మాట్లాడక పోవడం శోచనీయం అన్నారు. గోదావరి-బనకచర్లను ఆపే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలని కవిత కోరారు. కాళేశ్వరానికి జాతీయహోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల తీసుకోవాలన్నారు.