04-06-2025 01:01:03 PM
- మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనుల పరిశీలన
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. బుధవారం పలు గ్రామాలలో మార్నింగ్ వాకులో ప్రజలతో కలిసి పులిపలుపుల గ్రామంలో వీధులు తిరుగుతూ పర్యటించారు.ఇటీవల బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు నుండి పులిపలుపుల చెరువుకు నీరు అందించడానికి తన సొంత ఖర్చులతో కాలువ తవ్వించి నీటిని తరలించిన నేపథ్యంలో పులిపలుపుల పెద్ద చెరువులో ఎంత మేరకు నీరు చేరుకుంది చెరువు కట్ట,అలుగును గ్రామస్థులతో కలిసి పరిశీలన చేశారు...
పులిపలుపుల నుండి బీరెల్లిగూడం గ్రామం వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించి,రోడ్డుకు చుట్టు పక్కల ఉన్న రైతులతో మాట్లాడారు.రోడ్డు ను ప్రమాదకర మూల మలుపులు లేకుండా ఉండేలా చూడాలని రోడ్డు కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఉకోండి గ్రామానికి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండ మురళి, మర్రి మత్స్యగిరి యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ ,పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు ఉన్నారు.