15 April, 2026 | 7:26 AM

కవితతో బీఆర్‌ఎస్ ఎంపీ దామోదర్‌రావు భేటీ

27-05-2025 12:00 AM

పలు అంశాలపై 2 గంటలపాటు చర్చ

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు, పార్టీ లీగల్ సెల్ ఇన్‌చార్జి గండ్ర మోహన్‌రావు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి దాదాపు సుమారు ౨ గంటలకు పైగా చర్చించినట్టు సమాచారం.

లేఖ అనంతర పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులను చక్కదిద్దేలా చర్చలు జరిగినట్టుగా సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు అందిన అంశంపై కవిత ఎక్స్ వేదికగా స్పం దిస్తూ, కేటీఆర్‌కు మద్దతుగా, నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.