30 April, 2026 | 1:55 PM

మాజీ ఎమ్మెల్సీని కలిసిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు

29-04-2026 02:03 AM

తాడ్వాయి,ఏప్రిల్, 28( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో బంధువుల విందు కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని వారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవలే బిఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. ఆయనను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్, తాడ్వాయి మండలం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మదాం నర్సింలు, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.